Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 15 సాక్ష్యం న్యూస్: మండలంలోని పొట్నూరు గ్రామం శ్రీ నీలకంటేశ్వర దేవాంగసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భారీ అన్నసంతపణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు నాలుగు వేలమందికి సరిపడా ఆహార పదార్థాలను సిద్దం చేయగా...పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున పాల్గొని మండలంలో నెలకొల్పిన స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం అధ్యక్షుడు శ్రీ అల్లాడ మల్లికార్జున రావు, కార్యదర్శి దోర మృత్యుంజయరావు కోశాధికారి రోబ్బి సూర్యనారాయణ మరియు సంఘ యువత మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam