Neti Sakshyam - వార్తలు / Karnool/పత్తికొండ : కర్నూలు సాక్ష్యం ప్రథినిధి: ఎవరికి ఏ ఆపద వచ్చినా తనను నేరుగా కలవవచ్చని,శాంతి భద్రతల విఘాతం కలిగించేది ఎంతటివారైనా...ఉపేక్షించేది లేదని కర్నూలు జిల్లా పత్తికొండ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయన్న అన్నారు. తాజాగా పత్తికొండ పోలీసు ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన సాక్ష్యం టివితో మాట్లాడారు. బదిలీపై వచ్చిన తాను శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా సాక్ష్యం టివి రాయలసీమ ఇంచార్జి/ సీనియర్ జర్నలిస్ట్ తుగ్గలి సూర్య గౌడ్, CVR రిపోర్టర్ నరేంద్ర 90 టీవీ రిపోర్టర్ పెరవలి వీరేష్ లు CI జయన్నను మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ..శాలువతో సత్కరించారు.
Admin
Neti Sakshyam