Friday, 01 May 2026 03:26:50 AM

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి గంటా రవితేజ ఆర్థిక సాయం.

Date : 14 October 2024 02:10 PM Views : 726

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబరు14 సాక్ష్యం న్యూస్: భీమిలి కృష్ణాకాలనీలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన అగ్ని ప్రమాదంలో కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధంమైంది. దీంతో జీవనోపాధి పొదుకుంటున్న వియ్యపు తౌడు కుటుంబం రోడ్డున పడింది.ఉపాధి కోల్పోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన భీమిలి టౌన్ టిడిపి అధ్యక్షుడు/ మాజీ కౌన్సిలర్ గొలగాని నరేంద్ర విషయాన్ని MLA గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గంటా కుమారుడు గంటా రవితేజ తక్షణ సాయంగా తన సొంత నిధుల నుంచి 10,000/- ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని త్వరలోనే అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామాని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భీమిలి తెలుగుదేశం పార్టీ మూడవ వార్డు అధ్యక్షులు గొలగాని నరేంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాకెళ్ళ వెంకట్రావు మూడో వార్డు తెలుగుదేశం యువత అధ్యక్షులు కనకల అప్పలనాయుడు ఆవాల సూరిబాబు కొండ్రు రామస్వామి ఎం మహేష్ అప్పలకొండ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: