Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : సెప్టెంబరు 25 విశాలాక్షి నగర్ సాక్ష్యం న్యూస్: విద్యుత్ వినియోగదారుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది భాద్యతగా మెలగాలని జోన్-3 విశాలాక్షి నగర్ సబ్ స్టేషను ఏ.ఇ V. శ్వేత అన్నారు. ఇటీవల విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది బదిలీలు నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన లైన్ ఇన్స్పెక్టర్లు J. అనిల్ రాజ్ కుమార్, P. అప్పల సత్యారావు ( సతీష్), గ్రేడ్-2 JLM సురేష్ లను ఆమె అభినందిస్తూ... వారి వారి బాధ్యతలను గుర్తుచేసారు. ఈ సందర్భంగా విధుల్లోకి వచ్చిన వారు మిఠాయిలు పంచి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో Je గుర్నాధరావు తోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam