Friday, 19 June 2026 01:30:50 PM

భీమిలి మత్స్యకారులకు బోటు ఇంజన్లు పంపిణీ.

Date : 04 October 2024 08:35 AM Views : 555

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: మండలంలోని పెద్ద నాగమయ్యపాలెంలో రూ.59.40 వ్యయంతో 11 యూనిట్ల పెద్ద బోట్ ఇంజన్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం మత్స్యకారులకు అందజేశారు. పడవలకు ఈ ఇంజన్లు అమర్చుకోవడం వలన మరింత మత్స్య సంపద లభిస్తుందని చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ బోట్ ఇంజన్లు సమకూర్చిన దివీస్ సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఎన్.రావు, సీఎస్ఆర్ మేనేజర్ డి. సురేష్ కుమార్, భీమిలి టీడీపీ అధ్యక్షుడు డి.ఎ.ఎన్. రాజు, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, గరికిన పరుశురాం, శరగడ అప్పారావు, యరబాల అనీల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :