Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: మండలంలోని పెద్ద నాగమయ్యపాలెంలో రూ.59.40 వ్యయంతో 11 యూనిట్ల పెద్ద బోట్ ఇంజన్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం మత్స్యకారులకు అందజేశారు. పడవలకు ఈ ఇంజన్లు అమర్చుకోవడం వలన మరింత మత్స్య సంపద లభిస్తుందని చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ బోట్ ఇంజన్లు సమకూర్చిన దివీస్ సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఎన్.రావు, సీఎస్ఆర్ మేనేజర్ డి. సురేష్ కుమార్, భీమిలి టీడీపీ అధ్యక్షుడు డి.ఎ.ఎన్. రాజు, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, గరికిన పరుశురాం, శరగడ అప్పారావు, యరబాల అనీల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam