Monday, 15 June 2026 08:53:14 PM

పద్మనాభంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రులు .

Date : 03 October 2024 06:18 PM Views : 506

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: మండలంలో పలు గ్రామాలలో దుర్గాదేవీ శరన్నవరాత్రుల కార్యక్రమాలు గురువారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మద్ది, రెడ్డిపల్లి, విజయానందపురం, కృష్ణాపురం, గ్రామాలలో ఏర్పాటు చేసిన మండపాలలో దుర్గాదేవీ విగ్రహాలను అర్చకుల మంత్రోశ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా మద్దిగ్రామ పైడితల్లిమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మునసబు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గమ్మ తల్లికి ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైసీపీ యూత్ అధ్యక్షుడు బుగత సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాళ్ల పద్మ,ప్రత్యేక పూజలు జరిపించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :