Neti Sakshyam - వార్తలు / ఏలూరు/పెదపాడు : సెప్టెంబరు28 సాక్ష్యం న్యూస్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు దెందులూరు మాజీ శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి ఆద్వర్యంలో పెదపాడు మండల వైఎస్సార్ సిపి కన్వీనర్ అప్పన కనకదుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో అప్పనవీడు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అని కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఆరోపిస్తూ.. పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు ఎం పి పి శ్రీమతి బత్తుల రత్నకుమారి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam