Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 13 సాక్ష్యం న్యూస్: మండలంలో కోరాడ పంచాయితీ పరిధి గెద్దపేట గ్రామంలో స్ధానిక గణేషభక్త బృందం ఆధ్వర్యంలో గురువారం వినాయక నవరాత్రుల సందర్భంగా బారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అంతకుముందు స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు గెద్ద ఎర్రినాయుడు,గెద్ద ప్రసాదు,వెంకట రాజారావు,రాజునాయుడు, రమేష్, రాజేష, రమణారావు,సురేష్, రాజారావులు స్వామికి పూజలు చేసారు. అనంతరం స్వామివారి మండపం అసవరణలో సుమారు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గ్రామంలో కేవలం ఐదు అడుగుల స్వామివారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గొప్పవిషయమని గెద్ద ప్రసాదు గుర్తు చేశారు.
Admin
Neti Sakshyam