Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : పద్మనాభం: మండలం పాండ్రంగి గ్రామంలో యువతి అదృశ్యమైనట్లు పద్మనాభం పోలీసులు తెలిపారు. స్టేషను ఎస్.ఐ. జామి సురేష్ అందించిన వివరాల ప్రకారం పాండ్రంగి గ్రామానికి చెందిన షేక్ చానబీ (18) అనంతవరం జంక్షను సమీపంలోని ఓమ్ సాయి డాట్ కమ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది.ఈమె గత నెల 30 వతేదీన ఇంటినుండి బయటకు వెళ్లి, మళ్ళీ ఇంటికి చేరలేదనే విషయాన్ని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసారు. ఈమె ఆచూకీ తెలిసిన వారు పద్మనాభం పోలీసు స్టేషనకు సమాచారం అందించాలని ఎస్.ఐ. సురేష్ కోరారు.
Admin
Neti Sakshyam