Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : సెప్టెంబరు 25 సాక్ష్యం న్యూస్: మండలంలోని గుండుగొలను కు చెందిన శ్రీ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం,విద్యార్థులు వరద బాధితులకు యాబై వేలు విరాళం అందించి మానవత్వం చాటుకున్నారు. ఉపాధ్యాయులు ఒక రోజు వేతనాన్ని, విద్యార్థులు తలో చెయ్యి వేసి పోగు చేసిన 50వేల మొత్తాన్ని ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకి అందజేశారు. పిల్లలైనా పెద్ద మనసు చేసుకుని విరాళాలు ఇచ్చినందుకు సహకరించిన విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాల ప్రిన్సిపల్ ను mla అభినందించారు.
Admin
Neti Sakshyam