Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం శిర్లపాలెం పంచాయతీలో పలు సమస్యలను టిడిపి అధ్యక్షులు కోరాడ గౌరీ నాయుడు భీమిలి శాసన సభ్యులు గంట శ్రీనివాసరావుకి దృష్టికి తీసుకువెళ్ళారు.సిర్లపాలెం గ్రామంలో ఇనాం భూముల సమస్యలు పరిష్కరించాలని 45 అడుగుల ఎంకమ్మ చెరువు గెడ్డ పూడికిపోయి ప్రస్తుతం పది అడుగుల ఉందని, చర్యలు చేపట్టి చెరువుకు నీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే మరిడమ్మ గుడికి రోడ్డు ఏర్పాటు చేయాలని విన్నవించారు.ఇక గ్రామంలోని రామాలయం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని గుడి నిర్మాణానికి ప్రోత్సాహం అందించాలని MLA గంటకు వివరించడంతో..సానుకూలంగా స్పందించిన గంటా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని గౌరి నాయుడు తెలిపారు.
Admin
Neti Sakshyam