Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : దెందులూరు ,అక్టోబర్ 11 :సాక్ష్యం న్యూస్,దెందులూరు నూతన ఎస్సైగా శివాజీ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మండలంలోని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై శివాజీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించే వారి సమాచారం తనకు అందించాలని,. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
Reporter
Neti Sakshyam