Monday, 15 June 2026 08:47:52 PM

చేతి వృత్తిదారులకు ప్రభుత్వం తోడ్పాటు

Date : 10 October 2024 01:11 PM Views : 687

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబరు 10 సాక్ష్యం న్యూస్: దెందులూరు మండలంలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మహిళ డ్వాక్రా సంఘాల నిర్వహణ, వారి అభివృద్ధి సంక్షేమం పథకాల అమలుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. గురువారం దెందులూరు వెలుగు శాఖ కార్యాలయంలో జరిగిన డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రూప్ సభ్యులు ప్రభుత్వం అందించే పెట్టుబడిని చేతి వృత్తికి సంబందించిన యూనిట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. వాటి ద్వారా లక్ష నుండి ఐదు లక్షల వరకూ రుణాలు పొందవచ్చని వివరించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :