Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 11,పద్మనాభం సాక్ష్యం న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రతపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వలను ఉపసంహరించుకోవాలని బుధవారం ఎంపిడీఒ విజయకుమారకి గ్రామ సచివాలయ ఉద్యోగులు వినతి పత్రం అందజేసారు. పాఠశాల మరుగు దొడ్లు శుభ్రత విషయమై తాము ఫోటోలు తీయలేమని, ఉపాధ్యాయులు పలు మార్లు గతంలో నిరసన వ్యక్తం చేసిన నేపద్యంలో ప్రభుత్వం తమకు ఆపనిని బదిలీ చేయడం సరికాదన్నారు. తాము కూడ ఉన్నత చదువులు చదివి ఈ పని చేయడం తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతంతో పోల్చుకుంటే తాము చిరుద్యోగులే కావచ్చుని ఆత్మాభిమానం, విద్యార్హతలో తక్కువ కాదని అన్నారు. కాబట్టి పాఠశాల మరుగుదొడ్లు శుభ్రత ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
Neti Sakshyam