Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : అక్టోబర్ 26 విశాఖ సిటీ సాక్ష్యం న్యూస్: కోల్ కత్తాలోని ట్రైనీ డాక్టర్ మౌమితపై పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ... క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ ఏక్షన్ కమిటీ ఆద్వర్యంలో విశాఖ gvmc గాంధీ విగ్రహం వద్ద పెద్దఎత్తున మహిళలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు క్రైస్తవ సంఘాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా భరత మాతపై బలాత్కారమా అంటూ వివిధ ప్రార్థనా మందిరాలకు చెందిన మహిళలు, పారామెడికల్ సిబ్బంది, నర్శింగ్ స్టాఫ్,వైద్యులు, వైద్య సిబ్బంది, RCMసిస్టర్స్ పెద్దఎత్తున పాల్గొని సఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ.. క్రొవ్వొత్తులను వెలిగించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ట్రినిటీ లూధరన్ చర్చ్, A.B చర్చి, Q.M.B చర్చి, I.P చర్చి,కల్వరీ చర్చి, దైవ సన్నిధి ప్రార్ధనా సహవాసం, మరియు విశాఖ క్రిష్టియన్ విమెన్ ఫెలోషిప్ మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam