Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : భీమిలి రూరల్: డ్రగ్స్, మాదకద్రవ్యాలు వాడకాన్ని వ్యతిరేకిస్తూ..కృష్ణంరాజు పేట మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వాడడం వలన ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కలిగే నష్టాలను తెలియజేస్తూ..గ్రామంలోని వీధులన్నీ కలియదిరిగి డ్రగ్స్,మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ముఖ్యంగా నేటి యువత పొగ త్రాగడం, గుట్కా,ఖైనీ,నమలడం మంచిది కాదని..తక్షణమే వ్యసనాలకు బానిసవ్వకుండా పూర్తిగా మానుకోవాలని ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్లకార్డులతో విద్యార్థులు వివరించారు.
Admin
Neti Sakshyam