Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబరు17 సాక్ష్యం న్యూస్: చేతివృత్తుల కార్మికులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇవ్వనున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన,శిక్షణ తరగతులకు నిర్వహించారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి తదితర 18 రకాల చేతి వృత్తుల వారికి ఆర్థిక స్వావలంబన కలిగించేలా శిక్షణ ఉంటుందని.. అనంతరం ప్రభుత్వం రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ రుణ సదుపాయం కల్పిస్తుందని స్పష్టం చేశారు.
Admin
Neti Sakshyam