Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబరు 20 సాక్ష్యం న్యూస్: ఈ నెల 21 నుంచి 23 వరకు నాగ వంశీయుల కులదైవం భీమునిపట్నం శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త గాడు అప్పలనాయుడు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కుల పెద్దల సమక్షంలో ఆదివారం అమ్మవారి ఆలయం ప్రాంగణంలో పండుగ గోడపత్రికను ఆవిష్కరించారు. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగ సందర్భంగా అనేక నేల వేషాలు, పులి వేషాలు, బడ్ల వేషాలతో పాటు పలురకాల స్టేజి ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులు యావన్మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కొరారు.
Admin
Neti Sakshyam