Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: గాంధీజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ అన్నారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో దెందులూరు గ్రామం యాదవ్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో దెందులూరు గ్రామ ఎంపీటీసీ సభ్యులు పెనుబోయిన శేషారత్నం, వార్డు మెంబర్ నెరసి మారేశ్వరరావు, కొలుసు నాని, మాగంటి సోమయ్య, మరిదు శ్రీను,రుద్రబోయిన వీర్రాజు, నెరుసు సాయి గ్రామ యువత పాల్గొని మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు.
Admin
Neti Sakshyam