Monday, 15 June 2026 08:55:09 PM

ప్లాటినమ్ జూబ్లీ అట్టహాసంగా జరిపిద్దాం.

Date : 24 September 2024 10:09 AM Views : 550

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 23 సాక్ష్యం న్యూస్: మండలంలోని రెడ్డపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి సంబందించి త్వరలో జరగనున్న పాఠశాల ప్లాటినమ్ జూబ్లీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అంతా ముందుకు రావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.స‌న్యాసిరావు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సోమవారం పూర్వ విద్యార్థులతో ఈ ఉత్సవాల సన్నాహక సమావేశంను నిర్వహించారు. 1951 సెప్టెంబరు 19 న ఏర్పాటైన ఈ పాఠశాలలో ఎందరో విద్యాబుద్ధులను అలవరచుకున్నారని గుర్తుచేశారు, ఈ ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలను నిర్వాహణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో MPP రాంబాబు, పూర్వ విద్యార్థులు శ్యామసుందరరావు, సన్యాసినాయుడు, ఆదిబాబు, ఈశ్వరరావు , ఎం.అప్పలనాయుడు, బంగారునాయుడు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 23 సాక్ష్యం న్యూస్: మండలంలో బి.జె.పి.సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భీమిలి నియోజకవర్గ బి.జె.పి. ఇనచార్జి కె.రామానాయుడు అన్నారు. సోమవారం చిన్నాపురం, తునివలస గ్రామాలలో పర్యటించి పార్టీ నాయకులతో మాట్లాడారు. భీమిలి నియోజకవర్గంలో సభ్యత్వాల నమోదులో పద్మనాభం మండలం పూర్తిగా వెనుకబడిఉందని, మండలంలో పదివేలకి కనీసం వెయ్యి సేకరించలేదని వాపోయారు. 2) ప్లాటినమ్ జూబ్లీ అట్టహాసంగా జరిపిద్దాం. సెప్టెంబరు 23 సాక్ష్యం న్యూస్: మండలంలోని రెడ్డపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి సంబందించి త్వరలో జరగనున్న పాఠశాల ప్లాటినమ్ జూబ్లీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అంతా ముందుకు రావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.స‌న్యాసిరావు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సోమవారం పూర్వ విద్యార్థులతో ఈ ఉత్సవాల సన్నాహక సమావేశంను నిర్వహించారు. 1951 సెప్టెంబరు 19 న ఏర్పాటైన ఈ పాఠశాలలో ఎందరో విద్యాబుద్ధులను అలవరచుకున్నారని గుర్తుచేశారు, ఈ ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలను నిర్వాహణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో MPP రాంబాబు, పూర్వ విద్యార్థులు శ్యామసుందరరావు, సన్యాసినాయుడు, ఆదిబాబు, ఈశ్వరరావు , ఎం.అప్పలనాయుడు, బంగారునాయుడు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :