Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : నవంబర్ 13 :సాక్ష్యం న్యూస్ మండలంలోని మేజర్ గ్రామమైన పోతునూరు గ్రామంలో గౌరీదేవి ఆలయంలో గౌరి దేవి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతునూరు గ్రామస్తులు ఆధ్వర్యంలో గౌరీ దేవి అమ్మవారికి 17 రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణ చేసి ఆలయ ఆవరణలో మావిడాకులతో తోరణాలు కట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గౌరీ దేవి తల్లి ఉత్సవాలను గ్రామస్తులు ప్రారంభించారు .మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
Reporter
Neti Sakshyam