Friday, 19 June 2026 01:23:41 PM

దెందులూరులో హెచ్ పి సిఎల్ బయో గ్యాస్ ప్లాంట్ కు శంఖుస్థాపన.

Date : 03 October 2024 07:52 PM Views : 537

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: దెందులూరు మండలం కండ్రిక నరసాపురం గ్రామంలో సుమారు సుమారు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో హెచ్ పి సిఎల్ సంస్థ నిర్మించనున్న బయో గ్యాస్ తయారీ ప్లాంట్ కు శంఖు స్థాపన జరిగింది. కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ప్లాంట్ నిర్మాణ పనులపై సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :