Monday, 15 June 2026 08:47:07 PM

ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా.

Date : 03 October 2024 08:37 PM Views : 554

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధి వైయస్సార్ కాలనీలో ఇళ్ల స్థలాల దురాక్రమణలపై గ్రామ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు ఘాటుగా స్పందించారు. చిన్నపిల్లల స్మశాన వాటికను సైతం కబ్జాలు చేస్తుంటే ప్రశ్నించిన లక్ష్మణరావుపై కొందరు దాడి చేయడం దుర్మర్గమని దళితులు ఆందోళన బాటపట్టారు. కరెంట్ ఆఫీస్ వెనుక ఉన్న గడ్డ పోరంబోకు స్థలాన్ని కూడా చదును చేసి బిట్లుగా చేసి అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై వచ్చిన అసత్య ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ..గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మధ్య బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని ఎవరైనా నిరూపిస్తే తక్షణమే తాను గ్రామ సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :