Monday, 15 June 2026 08:52:41 PM

క్యాన్సర్ హాస్పటల్లో పండ్లు పంపిణీ

Date : 11 November 2024 05:24 PM Views : 1317

Neti Sakshyam - వార్తలు / ఏలూరు : నవంబర్11 సాక్ష్యం న్యూస్ , వైద్యులు,వైద్య సిబ్బంది సేవలు ఎనలేనివని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకర్ల శ్రీను అన్నారు. సోమవారం వంగాయగూడెంలోని గుడ్ సామరిటన్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ లో 108 మంది వృద్ధులు, వైద్యులు ,వైద్య సిబ్బంది ,ఫాదర్లు, సిస్టర్లు కు ఆయన పండ్లు పంపిణీ చేశారు. తన తల్లి రమాదేవికి క్యాన్సర్ రావడం ఈ హాస్పిటల్ లో చేర్చడం వైద్యులు వైద్య సిబ్బంది అందించిన సేవలతో తన తల్లి క్యాన్సర్ వ్యాధి నుంచి బయటికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తనవంతు కృతజ్ఞతగా వైద్యులు, వైద్య సిబ్బందికి పండ్లు అందజేయడం జరిగిందన్నారు. హాస్పటల్ డైరెక్టర్ ఫాదర్ వర్గో ,సీఈవో అజో అందించిన సహకారం ఏన్నటికి మరువనని కాకర్ల శ్రీను కృతజ్ఞతలు తెలిపారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :