Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / గజపతినగరం : గజపతినగరం టీడీపీ కార్యాలయంలో బొండపల్లి మండలం గరుడబిల్లి గ్రామానికి చెందిన 12 కుటుంబాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించిన మంత్రి, టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ నియమాలు పాటిస్తూ సీనియర్ నాయకుల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.
Admin
Neti Sakshyam