Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : ఫిబ్రవరి 23: అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్ విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే రెండుసార్లు మెమోలు జారీ చేసినప్పటికీ పనితీరులో మార్పు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. PGRS ద్వారా అందుతున్న వినతులను పరిష్కరించడంలో విఫలమైన 10 మంది అధికారులను నేరుగా పిలిపించి విచారించారు. “ప్రజల నుంచి వచ్చే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని” స్పష్టం చేశారు.
Admin
Neti Sakshyam