Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 26: భీమిలి మండలం బిల్లలమెట్ట ప్రాంతానికి చెందిన ఉప్పిల్లి సాయి లక్ష్మి (23) అనే యువతి అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారుడు ఉప్పిల్లి రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 25, 2026 ఉదయం 11 గంటల సమయంలో ఆమె ఇంటి నుండి కనిపించకుండా పోయింది. ఈ విషయంపై ఫిబ్రవరి 26, 2026 సాయంత్రం 5 గంటలకు భీమునిపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5 అడుగుల ఎత్తు, మాధ్యమ వర్ణం కలిగిన సాయి లక్ష్మి బ్లాక్ కలర్ నైట్ డ్రెస్ ధరించి ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Admin
Neti Sakshyam