Thursday, 05 March 2026 12:35:57 AM

Today News Head Lines

Date : 21 February 2026 08:57 AM Views : 102

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : 1) రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ సంస్థలతో 7 అవగాహన ఒప్పందాలు. (2) Supreme Court of India ఎంఎల్‌సీ అనంత సత్య ఉదయ భాస్కర్ హత్య కేసు దర్యాప్తుపై ఏపీ పోలీసులకు గడువు. (3) అసెంబ్లీ ప్రాంగణంలో హస్తకళల ప్రోత్సాహం కోసం 12 హ్యాండ్లూమ్ స్టాళ్లు ఏర్పాటు. (4) రంజాన్ సందర్భంగా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక హాజరు సడలింపు. (5). బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తీర జిల్లాల్లో మోస్తరు వర్షాల సూచన.కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. (6). SIPB సమావేశంలో ₹29,000 కోట్లకు పైగా విలువైన 27 ప్రాజెక్టులకు ఆమోదం. (7). అమరావతి టెక్నాలజీ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారుతుందని ప్రభుత్వం ప్రకటించింది. (8). Chittoor జిల్లాలో బర్డ్ ఫ్లూ అనుమానాలపై ఆరోగ్య శాఖ స్పష్టత – ప్రస్తుతం కనిపించని పాజిటివ్ కేసులు. (7). ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసవి ముందు జాగ్రత్తలపై వైద్యాధికారులకు మార్గదర్శకాలు. (8). Guntur జిల్లాలో కుటుంబ వివాదం విషాదంగా మారి భర్త హత్య. (9). తీరప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దాడులు. (10). మార్చి 16 నుంచి రాష్ట్రంలో ఒంటి పూట బడులు అమలు చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటన. (11). ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి – పరీక్షా కేంద్రాల సిద్ధత పూర్తి. (12). APSRTC విద్యాధరపురం డిపో ఖాళీ చేసి బస్సులను ఇతర డిపోలకు మార్చే నిర్ణయం.వేసవి రద్దీ దృష్ట్యా అదనపు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. (13). Vijayawada లో ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. (14). రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు వచ్చే వారం నిర్వహణ. (15). రబీ పంటల పరిస్థితిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. (16). రైతులకు మద్దతు ధర చెల్లింపుల వేగవంతంపై అధికారులకు సీఎం ఆదేశాలు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :