Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / గజపతినగరం : ఆగష్టు 6 :గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు గంటెడ శ్రీదేవి, పీఏసీఎస్ డైరెక్టర్ గొర్లె బంగారునాయుడు, క్లస్టర్ ఇన్చార్జ్ వైకుంఠ ప్రదీప్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Admin
Neti Sakshyam