Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 12: విశాఖ జిల్లా భీమిలిలోని జమ్మి చెరువు పార్క్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జమ్మి చెరువు అసోసియేషన్ ఆఫ్ వాకర్స్ సభ్యులు సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా భీమిలి జోనల్ కమిషనర్ విజయకుమార్కు వినతిపత్రం సమర్పించారు. పార్క్లో మౌలిక వసతులు మెరుగుపర్చడంతో పాటు వాకర్స్కు అవసరమైన సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గంటా నూకరాజు, బీసీ సెల్ అధ్యక్షులు సంకురభుక్త జోగారావు, నక్కెల్ల వెంకటరావు, జి. పోలిరాజు, కందుల సుందరరావు, శంకరరావు, మురళీ తదితర వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam