Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : మార్చి 23: తగరపువలస వై జంక్షన్ వద్ద భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సి.ఐ.టి.యు, డి.వై.ఎఫ్.ఐ భీమిలి జోన్ కమిటీల ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు జోన్ అధ్యక్షుడు ఆర్.ఎస్.ఎన్.మూర్తి మాట్లాడుతూ, సుఖదేవ్ థాపర్, శివరాం రాజ్ గురులతో కలిసి భగత్ సింగ్ చేసిన త్యాగం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో నీలాతి రాము, పల్లా పెంట రాజు, నమ్మి నాయుడు, డి.రామకృష్ణ, రీసు నరసింగరావు, మట్టా రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam