Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : ఏప్రిల్ 14: సీపీఎం భీమిలి జోన్ కమిటీ ఆధ్వర్యంలో తగరపువలస జంక్షన్లో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జోన్ అధ్యక్షుడు ఆర్ఎస్ఎన్ మూర్తి, నాయకులు పంపాన సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన ఇంకా సాధ్యం కాలేదని, పాలక పార్టీలు కులాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నాయని విమర్శించారు. మతం పేరుతో దళితులను చీల్చే ప్రయత్నాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కానూరి రమణ, డి. బాబాజీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam