Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / అనకాపల్లి జిల్లా : ఫిబ్రవరి 21 నక్కపల్లి సాక్ష్యం షార్ట్ న్యూస్: నక్కపల్లి మండలం సెట్టిబలిజిపేట శివారులో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఇన్స్పెక్టర్ మురళి నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. పోలీసులు ఘటనాస్థలంలో నుంచి ₹11,460 నగదు, 3 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. జూదానికి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
Admin
Neti Sakshyam