Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : మే 14 భీమునిపట్నం సాక్ష్యం న్యూస్: భారతీయ క్రైస్తవ మందిరం ఆద్వర్యంలో ఈ నెల 14, 15 తేదీలలో భీమిలి క్రిష్ణా కోలనిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ ఉజ్జీవ మహా సభలకు స్థానికంగా విశేష స్పందన లభించింది. ఈ సభలకు ధవళేశ్వరం N.R.P.S మినిస్ట్రీస్ G.జోషఫ్ వాక్య సందేశాన్ని అందించగా నరసాపురం నుంచి పాస్టర్ రీతు అద్బుతమైన సాక్షాన్ని పంచుకున్నారు. రెండు రోజులపాటు స్థానిక సంఘ కాపరి పాస్టర్ జాషువా బాబు ఆద్వర్యంలో జరిగిన ఆత్మీయ ఉజ్జీవ సభలు ఆద్యంతం పలువురు ఆలపించిన పాటలు, ప్రార్ధనలతో ఘనంగా ముగిశాయి.
Admin
Neti Sakshyam