Friday, 06 March 2026 04:48:16 PM

విజయాన్ని అందుకోవాలంటే మనోధైర్యం ఎంతో ముఖ్యం

Date : 11 November 2024 05:31 PM Views : 1205

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : నవంబర్ 11 ,సాక్ష్యం న్యూస్ ఏలూరు కేపిడిటీ హై స్కూల్ ఆడిటోరియంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు టిడిపి సీనియర్ నేత యూఎస్ రాంప్రసాద్ తో కలిసి ఆధ్వర్యంలో డిఎస్సీ అభ్యర్థుల కోసం జరుగుతున్న 100రోజుల ఉచిత మెగా డిఎస్సీ తరగతులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షించారు. ఉచిత శిక్షణ తరగతులకు హాజరు అవుతున్న అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అని, స్టేషనరీ, స్టడీ మెటీరియల్స్ , లంచ్, స్నాక్స్ వంటి సదుపాయాలను కూడా వారికి ఉచితంగా అందజేయాలని శిక్షణ శిబిరం ఇంచార్జీ లకు సూచించారు.. పోటీ పరీక్షలో అయినా, జీవితంలో అయినా విజయం సాధించాలి అంటూ అభ్యర్థులకు ముందుగా ఉండాల్సింది మనోధైర్యం అని, తన మీద తనకి నమ్మకం ఉన్నప్పుడే అభ్యర్థులు విజయం సాధిస్తారని, నమ్మకానికి నాలెడ్జి కూడా తోడైతే విజయం తప్పక వరిస్తుందని, ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ లో అత్యధికంగా ఉపాధ్యాయ పోస్టులు పొందేలా అభ్యర్థులు సిద్ధంగా ఉండలని శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :