Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ మధురవాడ : విశాఖపట్నం: సాక్ష్యం న్యూస్ అంబేత్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలంటే..ఆయన రచించిన రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని APSEB SC &ST EMPLOYEES WELFARE ASSOCIATION జోన్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ పొలకి శ్రీనివాసరావు అన్నారు. 135వ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ళు శ్రమించి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. మధురవాడ జోన్-3 కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని A.Eలు, ADEలు JEలు లైన్ ఇన్స్పెక్టర్లు లైన్ మెన్ల సమక్షంలో వేడుకగా జరిపించారు. అంతకుముందు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
Admin
Neti Sakshyam