Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : నవంబర్ 8 సాక్ష్యం న్యూస్: ఏపుగా ఎదిగిన చెట్ల కొమ్మలకు విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న దృష్ట్యా చెట్ల కొమ్మలు నరికే కార్యక్రమం మరియు విద్యుత్ లైన్ల మరమ్మత్తులు చేపట్టే పనుల నేపథ్యంలో పద్మనాభం మండలం పొట్నూరు పంచాయతి పరిధిలో ఉదయం 9:00 గంటలనుండి మద్యాహ్నం 3:00 గంటల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జోన్-3 విశాఖపట్నం పోలాకి శ్రీనివాసరావు తెలిపారు. కలిగిన అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
Admin
Neti Sakshyam