Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : నవంబర్ 7: సాక్ష్యం న్యూస్ ప్రతి ఒక్కరు ఓపికతో ఉండాలని, వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో దెందులూరు, పెదపాడు మండల నాయకులు, గ్రామ నాయకులు ఆయనను కలిశారు. గ్రామాల్లో జరిగిన జరుగుతున్న పార్టీ పరమైన సంఘటనలో దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులపై సుదీర్ఘంగా వివరించారు. వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ మండలనాయకులు నిట్టా గంగరాజు ,పెదపాడు మండల వైయస్సార్సీపి ఎస్సీ సెల్ నాయకులు బత్తుల యేసు రాజు ,పోతునూరు గ్రామ సర్పంచ్ బోదులస్వరూప్ , దోసపాడు నాయకులు మహేంద్ర, గాలాయగూడెం పంచాయతీ వార్డు మెంబర్ శ్రీధర్ కార్యకర్తలు ఉన్నారు.
Reporter
Neti Sakshyam