Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ మధురవాడ : జనవరి 1 సాక్ష్యం న్యూస్: విద్యుత్ సిబ్బందిని సమన్వయం చేయడం తోపాటు..విధి నిర్వాహణలో తనదైన శైలిలో వినియోగదారులకు సేవలందించడం ఒక్క పోలాకి శ్రీనివాసరావుకే దక్కుతుందని APSEB SC & ST EMPLOYEES WELFARE ASSOCIATION అధ్యక్షుడు G.V దొర అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం మధురవాడ జోన్-3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫోలాకి శ్రీనివాసరావును మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా మాట్లాడారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరిలో అందరివాడని కొనియాడారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశిస్తూ..డివిజన్ సెక్రటరీ జల్లి అనిల్ రాజ్ కుమార్ తోపాటు అసోసియేషన్ సభ్యులంతా E.E శ్రీ పొలాకి శ్రీనివాసరావుని ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో జూనియర్ ఇంజనీర్ బోని గుర్నాధరావు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam