Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / అల్లూరి జిల్లా /అరకు : అక్టోబరు 22 సాక్ష్యం న్యూస్: అల్లూరి జిల్లా అరకు పరిధిలోని చిమిడిపల్లి రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొత్తవలస నుంచి కిరండోల్ కేకే లైనుకు వెళ్తున్న రైలు బోగి చిమిడిపల్లి రైల్వే స్టేషన్ చేరుకునేసరికి పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రైళ్ళ రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన చోట పునరుద్ధరణ పనులను వేగంగా చేపడుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
Reporter
Neti Sakshyam