Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : నవంబర్ 6 సాక్ష్యం న్యూస్: కొత్త యాప్ ల ద్వారా VOA లకు పని భారం పెంచి ఈ ప్రభుత్వం తమకు చాలీ చాలని జీతాలు ఇచ్చి ఇబ్బందులు పెడుతుందని..భీమిలి రూరల్ ఏరియా వి ఓ ఏ నాయకురాలు ఉత్తడ పార్వతి అన్నారు. వెలుగు వి ఓ ఏ( ఎన్ మేటర్స్ ఉద్యోగ సంఘం సిఐటియు! ఆధ్వర్యంలో భీమిలి వెలుగు ఆఫీస్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ తరపున వర్ల రామయ్య గారు మాట ఇచ్చారని! మరలా ఇప్పుడు ఈ సర్క్యూలర్ తీసుకురావడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే మూడు సంవత్సరాల కాలం పరిమిత సర్కులర్ ని రద్దు చేయాలని VOAలకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వివో ఏలు కు సిఐటియు అండగా ఉంటుందని మాట్లాడారు.
Admin
Neti Sakshyam