Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 20 సాక్ష్యం న్యూస్: భీమిలి టౌన్ 11KV, భీమిలి రూరల్ మరియు 11KV, పాలిటెక్నిక్ ఫీడర్ విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మలు తాకుతూ..విద్యుత్ అంతరాయం కలుగుతోందని..ఈ నేపథ్యంలో వాటిని తొలగించడంతో పాటు లైన్ల మరమ్మత్తులు చేపట్టే కార్యక్రమాన్ని శుక్రవారం (21-02-2025) ఉదయం 9.00 గంటల నుండి మద్యాహ్నం 3.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, జోన్-3, విశాఖపట్నం. పోలాకి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంక్ కాలనీ, తాతాజీ నగర్, ఎల్లంపేట, మహాలక్మీపురం, డెక్కటీపాలెం, రాజలింగంపేట, రేఖవానిపాలెం, రాయప్పాలెం, మరడపాలెం, మూలకుద్దు, స్మిత్ వీధి, జగనన్న కాలనీ, నేరెళ్లవలస, SOS, మరియు భీమిలి టౌన్ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని స్పష్టం చేశారు..ఇందుకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
Admin
Neti Sakshyam