Friday, 06 March 2026 05:45:14 PM

దేశ పురోగతికి వారధిగా ఉపాద్యాయులు

Date : 06 December 2024 01:28 PM Views : 1005

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విజయనగరం/భోగాపురం : డిసెంబర్ 6 సాక్ష్యం న్యూస్: నేటి బాలలను రేపటి బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాద్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రిటైర్డ్ ప్రిన్సిపాల్ ముళ్ళపూడి కోటేశ్వరరావు అన్నారు. భోగాపురం మండలం ముక్కాం జిల్లాపరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలు బాగా చదివి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశించే వారిలో ఉపాద్యాయులే ముందుంటారని గుర్తుచేసారు. ఈ సందర్భంగా 33 ఏళ్ళపాటు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి పదవీ విరమణ పొందిన ఉత్తమ ఉపాధ్యాయురాలు శ్రీమతి పాతూరి సూర్యకాంతాన్ని అభినందింస్తూ... ఆమె సేవలను కొనియాడారు.అంకిత భావంతో పనిచేసిన ఉపాద్యాయనీ ఉపాద్యాయుల సేవలు సమాజం మరచిపోదని గుర్తుచేసారు. ఈ సందర్భంగా ఆమెను తోటి ఉపాద్యాయులు, విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :