Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : డిసెంబర్ 13 ,సాక్ష్యం న్యూస్: గత రెండు రోజులుగా జరుగుతున్న బాలికల ఇంటర్ మోరల్ ఖోఖో క్రీడా పోటీలు ముగిసాయి. మండలంలోని గోపన్న పాలెం శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో జరిగిన ఖోఖో పోటీల్లో రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ మొదటి స్థానం , గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాల క్రీడాకారులు రెండవ స్థానం, తుని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడాకారులు మూడో స్థానం, రాజమండ్రి యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీ నాలుగో స్థానం సాధించారని వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ నతానియల్ తెలిపారు. విజేతలకు కూటమి నాయకులతో కలిసి ప్రిన్సిపల్ నతానియల్ బహుమతులు అందజేశారు
Reporter
Neti Sakshyam