Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : డిసెంబర్11 ,సాక్ష్యం న్యూస్ ఆధ్యాత్మికతను పెంపొందించడమే లక్ష్యంగా స్థానిక గౌడ వీధిలో సాల్వేశ్ ఆర్మీ మిలీనియం చర్చ్ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసినట్లు దెందులూరు గ్రామానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు దివంగత పల్లె యోహాను చంద్రహాస దంపతులు తెలిపారు. దీంతో సంఘ సభ్యుల సహకారం అందించడంతో నూతన చర్చి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగి చర్చి నిర్మాణం పూర్తయింది. దీంతో ఈనెల 14న సాల్వేశ్నార్ని రాష్ట్రీయ కార్యదర్శి లెఫ్ట్నెంట్ కల్నల్ మాసిలా మోని స్టాలిన్ వైయస్ కేజియాల్ స్టాలిన్ చేతుల మీదుగా నూతన చర్చి ప్రారంభోత్సవం జరగనుందని చర్చ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాల్వేషన్ఆర్మీ డివిజనల్ కమాండర్ జర్నీ మోషే జల్లి మేరీ స్థల దాత కుటుంబ సభ్యులు సంఘస్తులు గ్రామస్తులు సాల్వేషనర్మీ అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని కోర్ ఆఫీసర్ మేజర్ కాకి రమణయ్య వివరించారు.
Reporter
Neti Sakshyam