Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : నవంబర్ 15 సాక్ష్యం న్యూస్; భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని..భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నండూరి వీర్రాజు (కలింగ రాజు) అన్నారు. ఈ మేరకు శుక్రవారం APCC అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి తనకు భీమిలి నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమిస్తూ.. నియామక పత్రాన్ని పంపించారని కళింగ రాజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తనను గుర్తిస్తూ... ఈ పదవిని అందించిన తమ నాయకురాలు షర్మిలా రెడ్డికి, DCC అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మరాజు ( హాసిని వర్మ)కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Neti Sakshyam