Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఆముదాలవలస / గార్లపాడు : శ్రీకాకుళం మే 13 సాక్ష్యం న్యూస్: గ్రామస్థుల సహకారంతో గార్లపాడు గ్రామంలో మాస్టర్స్ ఫెలోషిప్ పేరుతో నూతనంగా నిర్మించిన ప్రార్ధనా మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. విశాఖకు చెందిన Vision Nateves ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ అర్జునరావు చిగులూరి రిబ్బన్ కత్తిరించి అనంతరం వాక్య సందేశాన్నందించారు. ఈ సందర్భంగా ముఖ్య అథిదులు గార్లపాడు పంచాయతి సర్పంచ్ తొత్తడి మురళీకృష్ణ శుభాకాంక్షలు తెలుపగా... పాస్టర్లు చల్లా కరుణాకర్, దేవా, ఆనంద్ గుప్తా, ఐజక్ తోపాటు పలువురు సేవకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో గార్లపాడు గ్రామస్థులు, పరిసర ప్రాంతాలకు దైవ సేవకులు, విశ్వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam