Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : డిసెంబర్ 23 సాక్ష్యం న్యూస్: ఈ నెల 25న భీమిలి బీచ్ రోడ్డులోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆద్వర్యంలో 23వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ పింగళి అనంద కుమార్ తెలిపారు. ఆర్ష సూఫీ సిద్దాంత స్పూర్తితో గత 552 సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తోందని గుర్తుచేసారు. ఈ నెల 25 న నిర్వహించే 23వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 9:30 నుండి మద్యాహ్నం 12:00 గంటల వరకు భీమిలి ఉమర్ అలీషా ఆశ్రమంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Admin
Neti Sakshyam