Wednesday, 16 September 2026 06:11:55 AM

ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో నీటి సరఫరాకు ఏర్పాట్లు

Date : 26 October 2024 03:55 PM Views : 1479

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 26 సాక్ష్యం న్యూస్, ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో త్రాగునీరు ఏర్పాట్ల కోసం 17,000 మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు 36వేల రూపాయలు. ప్రభుత్వం మంజూరు చేసిందని, యుద్ధ ప్రాతిపదికన ఆ పనులను పర్యవేక్షిస్తున్నామని దెందులూరు మండలం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారి (ఆర్డబ్ల్యూఎస్) ఏఈ చింతమనేని వర్మ అన్నారు. శనివారం దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని పెద్ద దళితవాడలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారి పిల్లల త్రాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేయనున్న మంచినీటి పైపులైను వ్యక్తిగత మరుగుదొడ్లను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చింతమనేని వర్మ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గీతా లక్ష్మీదేవి ,శ్రావణి లు పరిశీలించారు. దెందులూరు మండలంలోని దోసపాడు గ్రామం తో పాటు సోమవరపు పాడు, కొవ్వలి, చల్లపల్లి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు మంచినీటి అవసరాల కోసం చర్యలను తీసుకోవడం జరిగిందని అన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :