Friday, 01 May 2026 03:25:02 AM

పరదేశమ్మ నవశక్తి దేవతల విగ్రహ ప్రతిష్ట. మహోత్సవం

Date : 20 February 2026 05:41 PM Views : 166

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : ఫిబ్రవరి 20 సాక్ష్యం షార్ట్ న్యూస్: భీమునిపట్నం బీచ్ రోడ్‌లోని చెప్పాలుపడ సముద్ర తీర ప్రాంతంలో నిర్మించిన సుందరమైన ఆలయంలో పరదేశమ్మ నవశక్తి దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం జన కోలాహలంతో ఘనంగా నిర్వహించబడింది. వేద పండితుల వేదఘోషల మధ్య ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక యాగాలు, పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గరికిన కింగ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని భవ్యంగా నిర్మించి పరదేశమ్మతో పాటు నవశక్తి దేవతల విగ్రహాలను ప్రతిష్టించారు. శనివారం విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ (భరత్), ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు సందర్శించనున్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :